‘పర్యావరణ’ సూచీలో భారత్‌కు 20వ ర్యాంకు | India ranks 20th in Climate Change Performance Index | Sakshi
Sakshi News home page

‘పర్యావరణ’ సూచీలో భారత్‌కు 20వ ర్యాంకు

Nov 18 2016 10:18 AM | Updated on Sep 4 2017 8:27 PM

పర్యావరణ మార్పుల పనితీరు సూచీ(సీసీపీఐ)లో భారత్‌ ఆరు స్థానాలు ఎగబాకి 20 ర్యాంకుకు చేరింది.

మరాకేస్‌(మొరాకో): పర్యావరణ మార్పుల పనితీరు సూచీ(సీసీపీఐ)లో భారత్‌ ఆరు స్థానాలు ఎగబాకి 20 ర్యాంకుకు చేరింది. 58 దేశాలకు ‘జర్మన్‌ వాచ్‌ అండ్‌ క్లైమేట్‌ యాక్షన్‌ నెటవర్క్‌ యూరప్‌’ విడుదల చేసిన 2016  సూచీ.. వర్ధమాన దేశాలు పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలు పాటించాలని సూచించింది.

‘ఉద్గారాల విషయంలో భారత్‌ పనితీరు బాగుంది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో స్కోరు మెరుగుపడింది. బొగ్గు నుంచిసాంప్రదాయేతర వనరుల్లోకి పెట్టుబడులు మళ్లించడం మంచి చేస్తుంది.  ఉద్గారాలు తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, బ్రెజిల్, చైనాల వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటోంది’ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement