అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి | Hyderabad Woman Suspicious Death In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

Oct 7 2019 8:37 AM | Updated on Oct 7 2019 11:57 AM

Hyderabad Woman Suspicious Death In America - Sakshi

న్యూయార్క్‌ : అమెరికాలో ఓ తెలుగు మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన నార్త్‌ కరోలినాలో ఆదివారం చోటుచేసుకుంది. గజం వనిత(38) అత్తింటి వేధింపులు తాళలేక కొంతకాలంగా హైదరాబాద్‌లోని నాగోల్‌ సాయినగర్‌లో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే జులై నెలలో నార్త్‌ కరోలినాలోని భర్త వద్దకు తిరిగివెళ్లిపోయింది. ఆ తర్వాత 2 నెలలనుంచి తల్లిదండ్రులతో కాంటాక్ట్‌లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం వనిత తల్లిదండ్రులకు ఆమె సూసైడ్‌ చేసుకున్నట్లు సమాచారం అందింది.

అత్తింటి వేధింపులు భరించలేకే వనిత మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. ఘటన జరిగిన అనంతరం ఆమె భర్త రాచకొండ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న కరోలినా పోలీసులు విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement