ప్రజాసంఘాల నేతల అరెస్టు, విడుదల | varavararao stage protest at ntr bhavan arrest, released | Sakshi
Sakshi News home page

ప్రజాసంఘాల నేతల అరెస్టు, విడుదల

Oct 28 2016 8:19 AM | Updated on Mar 28 2019 5:07 PM

ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని గురువారం అర్థరాత్రి ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని గురువారం అర్థరాత్రి ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ భవన్ వద్ద విరసం నేత వరవరరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. సమావేశం జరుపుకుంటున్న మావోయిస్టు నేతలను కావాలనే కాల్చి చంపారని ఆరోపించారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement