ప్రజాసంఘాల నేతల అరెస్టు, విడుదల | Sakshi
Sakshi News home page

ప్రజాసంఘాల నేతల అరెస్టు, విడుదల

Published Fri, Oct 28 2016 8:19 AM

varavararao stage protest at ntr bhavan arrest, released

హైదరాబాద్: ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని గురువారం అర్థరాత్రి ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ భవన్ వద్ద విరసం నేత వరవరరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. సమావేశం జరుపుకుంటున్న మావోయిస్టు నేతలను కావాలనే కాల్చి చంపారని ఆరోపించారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement