స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు | v.hanumanth rao fired on trs party | Sakshi
Sakshi News home page

స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు

Jun 15 2016 2:42 AM | Updated on Aug 15 2018 9:30 PM

స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు - Sakshi

స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు

: స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నవారంతా బంగారు తెలంగాణ అంటూ ముసుగు వేసుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు.

రాజ్యసభ సభ్యుడు వీహెచ్
సాక్షి, హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నవారంతా బంగారు తెలంగాణ అంటూ ముసుగు వేసుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ ఈ రెండేళ్లలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.

తాగండి, తినండి, పనిచేయకండి అనే రీతిలో ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాలను విస్తృతం చేశారన్నారు. కేసీఆర్ వాగ్దానాలు, వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవుల నుంచి తప్పుకుంటానన్న జానారెడ్డి ప్రకటనతో కార్యకర్తలు ఐధైర్యపడతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement