పాఠశాల భవనంపై నుంచి దూకి ఉపాధ్యాయుడొకరు ప్రాణం తీసుకున్నారు.
హైదరాబాద్: పాఠశాల భవనంపై నుంచి దూకి ఉపాధ్యాయుడొకరు ప్రాణం తీసుకున్నారు. కూకట్పల్లి శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో పనిచేసే రాజు (34) అనే ఉపాధ్యాయుడు శనివారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకారు.
తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.