‘కల్యాణలక్ష్మి’పై చర్చలో షబ్బీర్
- ఆదాయ పరిమితి పెంచాలి: పొంగులేటి
- అర్హుల ఎంపికలో ఎమ్మెల్సీలను భాగస్వాములను చేయాలని డిమాండ్
- ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వలేం: జగదీశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాల అభ్యున్నతి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీ ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. బీసీల కోసం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులను 12 శాతానికి మించి ప్రభుత్వం ఖర్చు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శిం చారు. కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ వర్గాలకు రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.34 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని, మరో రెండు నెలల్లో కొత్త బడ్జెట్ కూడా రాబోతుందని తెలిపారు.
ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 49 శాతం ఖర్చు చేసిన సర్కారు, ఎస్సీలకు కేటా యించిన నిధుల్లో 69 శాతం ఖర్చు చేయలేదన్నారు. మైనార్టీలకు సంబంధించి షాదీ ముబారక్ పథకం కింద 25 వేల దరఖాస్తులు వస్తే కేవలం 9 వేల (30 శాతం) దరఖాస్తులనే క్లియర్ చేసిందని చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మా యిల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ హయాంలోనే ఇలాంటి పథకాన్ని అమలు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన పథకం మంచిదే అయినప్పటికీ, అమలు తీరు ఘోరంగా ఉందని విమర్శించారు.
ఆధార్ ఆధారంగానే పరిశీలన: జగదీశ్రెడ్డి
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆయా పథకాలకు అర్హులైన ఆడపిల్లల కుటుంబాలకు రూ.51 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని చెప్పారు. 2014–15లో 5,779 మంది, 2015–16లో 76,182 మంది, 2016–17లో 32,513 మంది ఆడపిల్లలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల ద్వారా లబ్ది పొందినట్లు వివరించారు. వివాహ సమయానికి సొమ్ము అందాలంటే నెల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతేడాది అందిన దరఖాస్తుల మేరకు ఈ ఏడాది అంచనాలను రూపొం దించి బడ్జెట్లో నిధులు (ప్రొవిజన్) కేటాయించా మని, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ లబ్ది చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిర్ధిష్టమైన పరిధిలో అర్హు లను గుర్తించేందుకు ఎమ్మె ల్యేలకు మాత్రమే వీలున్నం దున, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిం చలేమని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.
ఆదాయ పరిమితి 3 లక్షలకు పెంచాలి
పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఉద్దేశించిన ఈ పథకంలో ఆయా కుటుంబాల ఆదాయ పరిమితిని గ్రామాల్లో రూ.2.5 లక్షలకు, పట్టణాల్లో రూ.3 లక్షలకు పెంచాలని పొంగులేటి కోరారు. మజ్లిస్ సభ్యుడు రజ్వీ మాట్లాడుతూ.. మైనార్టీలు సమర్పించిన దర ఖాస్తుల పరిశీలనను సులభతరం చేయాలన్నారు. ఎమ్మెల్సీ లకు కూడా ఆయా పథకాల అమలు బాధ్య తలను అప్పగించాలని రామచంద్ర రావు కోరారు.
బీసీలంటే చులకన ఎందుకు?
Published Tue, Dec 27 2016 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement