గణతంత్ర వేడుకలకు బందోబస్తు: సీఎస్‌ | Security for the republic day celebrations says CS | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు బందోబస్తు: సీఎస్‌

Jan 9 2018 2:18 AM | Updated on Aug 21 2018 11:44 AM

Security for the republic day celebrations says CS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో 26న జరిగే వేడుకల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, విద్యుత్, మెట్రో వాటర్‌ వర్క్స్, సమాచార, ఉద్యానవన, రహదారులు, భవనాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాల న్నారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement