సీసీఎస్ నుంచి తీసుకున్న నిధులు చెల్లించాలని ఈయూ డిమాండ్
ప్రభుత్వం గ్రాంటు ఇస్తే చెల్లిస్తామన్న అధికారులు
2 నుంచి సమ్మెలోకి వెళుతామని ప్రకటించిన కార్మికసంఘాలు
సాక్షి, హైదరాబాద్: కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) నిధులను సొంతానికి వాడుకుని తిరిగి జమచేయని అంశం ఆర్టీసీలో చిచ్చురేపుతోంది. నిధులకోసం కార్మికులు సమ్మెబాట పట్టారు. శనివారం నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్టు ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ వేణుగోపాల్కు కార్మిక నేతలు తేల్చి చెప్పారు. సీసీఎస్కు సంబంధించి ఆర్టీసీ ఇప్పటికే రూ.220 కోట్లను వాడుకుంది.
వడ్డీతో కలిపి ఇది రూ.293 కోట్లకు చేరింది. క్రెడిట్ సొసైటీకి ఈ సొమ్మును జమచేయకపోవటంతో కార్మికులకు రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొంతకాలంగా ఈయూ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేస్తున్నారు. ఈక్రమంలో రెండు రోజులుగా హైదరాబాద్, విజయవాడల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ వేణుగోపాల్ ఈయూ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, తెలంగాణ ప్రతినిధులు బాబు, భాస్కరరావు, మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు దామోదరరావు, సోమరాజు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సీసీఎస్ సొమ్మును చెల్లించే పరిస్థితి లేదని, ప్రభుత్వం గ్రాంటు ఇస్తే సీసీఎస్కు జమ చేస్తామని ఇన్చార్జి ఎండీ వేణుగోపాల్ వారికి స్పష్టం చేశారు.
అయితే దీనికి ఒప్పుకోని నేతలు వెంటనే సీసీఎస్ నిధులు జమచేయని పక్షంలో ముందు హెచ్చరించినట్టుగా రెండో తేదీ నుంచి సమ్మె ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. అయితే సమ్మె విషయంలో ఈయూతో మరో ముఖ్య కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) విభేదిస్తోంది. ముందస్తు నోటీసులు లేకుండా సమ్మెచేయడం సరికాదని పేర్కొంది.
4న ఎర్రబ్యాడ్జీలతో నిరసన : ఎన్ఎంయూ
ఆర్టీసీలో వేతన సవరణ, లీవ్ ఎన్క్యాష్మెంట్, డీఏ బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. తదితర విషయాల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ 4న కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధుల్లో పాల్గొంటారని ఎన్ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీలో సమ్మె సైరన్
Published Fri, Aug 1 2014 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement