- వేతనం రూ.15 వేలు మించితే యాజమాన్యం తన వాటా చెల్లించదు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో భవిష్య నిధి చెల్లింపు అంశంలో యాజమాన్యం నిర్ణయం కార్మికుల సంక్షేమం పాలిట గొడ్డలిపెట్టుగా మారనుంది. ఉద్యోగి మూల వేతనం(బేసిక్ పే), కరువు భత్యం(డీఏ) కలిపి రూ.15 వేలు దాటితే తన వాటా భవిష్య నిధి(పీఎఫ్)ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1.32 లక్షల మంది ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరగనుంది. యాజమాన్యంపై భారాన్ని తగ్గించుకునేందుకు కార్మికుల పీఎఫ్లో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పెండింగ్లో వేలాది దరఖాస్తులు
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము రూ.250 కోట్లను యాజమాన్యం సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో పీఎఫ్ సొమ్ము నుంచి రుణం కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు వేలాదిగా పెండింగ్లో ఉన్నాయి.
ఆర్టీసీకి నెలకు రూ.60 కోట్లు ఆదా!
ఉద్యోగి మూలవేతనం, డీఏ కలిపి రూ.15 వేల పరిమితి దాటితే తన వంతు వాటా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత నుంచి వైదొలుగుతున్నట్లు పీఎఫ్ కమిషనర్కు ఆర్టీసీ యాజమాన్యం త్వరలో లేఖ రాయనుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే కార్మిక సంఘాలకు నోటీసులివ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. తన వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆర్టీసీకి నెలకు రూ.60 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
‘‘పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సాంబశివరావుకు వినతి పత్రం ఇచ్చాం. ఒకవేళ మొండిగా ముందుకెళితే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు’’
- జిలానీ బాషా, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షులు
‘‘ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. దొడ్డిదారిన నిర్ణయాలను అమలు చేస్తోంది. పీఎఫ్ బాధ్యత నుంచి తప్పుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’
- రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు
ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్పై నీలినీడలు!
Published Mon, Feb 15 2016 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement