ప్రారంభమైన కోదండరామ్‌ రైతు దీక్ష | Raithu deeksha starts over Farmer problems at Indira Park | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన కోదండరామ్‌ రైతు దీక్ష

Oct 23 2016 10:19 AM | Updated on Sep 29 2018 7:10 PM

ప్రారంభమైన కోదండరామ్‌ రైతు దీక్ష - Sakshi

ప్రారంభమైన కోదండరామ్‌ రైతు దీక్ష

రైతు దీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్‌ వద్ద ప్రారంభమైంది.

హైదరాబాద్‌: రైతుల సమస్యలపై తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రైతు దీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్‌ వద్ద ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రైతు దీక్షకు దిగారు. ఆయనతో పాటు రైతు సంఘాల నాయకులు కూడా దీక్షలో పాల్గొన్నారు.

రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కోదండరామ్‌ రైతు దీక్ష చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కోదండరామ్‌ రైతు దీక్ష చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement