కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కళాశాల యాజమాన్యం వధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు.. హయాత్నగర్ మండలం గుంతపల్లిలో కన్సెల్టెన్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బీహార్కు చెందిన ఆశుతోష్ అనే వ్యక్తి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో తన కన్సల్టెన్సీ ద్వార విద్యార్థులని జాయిన్ చేయించాడు. దానికి సంబంధించి రావాల్సిన డబ్బులు కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.