-
ఆప్టిమ్హైర్లో నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగానికి నియామక సేవలు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ ఆప్టిమ్హైర్ ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్యను 300లకు చేర్చనుంది. ప్రస్తుతం కంపెనీలో 120 మంది సిబ్బంది ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీకి 120కి పైచిలుకు క్లయింట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మంది అభ్యర్థుల ముందస్తు ఇంటర్వ్యూలు పూర్తి చేశామని ఆప్టిమ్హైర్ ఫౌండర్, సీఈవో లక్ష్మి ఎం కొడాలి తెలిపారు. కో–ఫౌండర్ సీహెచ్.పవన్ కుమార్ రావు, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అశుతోష్ వ్యాస్తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగి నియామకానికి కంపెనీలకు ఆరు నెలల దాకా సమయం పడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సాయంతో ఈ సమయాన్ని 12 రోజులకు కుదించగలిగాం. రెండు, మూడు ఇంటర్వ్యూ దశలను తగ్గించేలా అభ్యర్థులను వడపోస్తాం. మా వేదిక ద్వారా 5,700 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరి గరిష్ట వేతనం భారత్లో రూ.80 లక్షలు, యూఎస్లో రూ.3 కోట్ల వరకు ఉంది. రెఫరల్ పార్ట్నర్స్ 2,000 మంది ఉన్నారు. అభ్యర్థులను రెఫర్ చేయడం ద్వారా వీరు నెలకు రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు’ అని వివరించారు. -
బిహార్ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా?
బిహార్ చాణక్యుడిగా పేరొందినవాడు ఇప్పుడు ఏకాకి అయ్యాడు. మిత్రులు, ప్రత్యర్థులు ఇరువురూ తనను ఇప్పుడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు బిహార్ ప్రజలు మాత్రమే ఆయన ఆశాకిరణం. నితీశ్పై, ఆయన రాజకీయాలపై ఈ ఎన్నికలు ఒక రెఫరెండం లాంటివి. 69 ఏళ్ల వయసులో నితీశ్ తన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద సమరంలో తలపడుతున్నారు. బీజేపీతో కూటమి ఇప్పుడు ఒక ముసుగు మాత్రమే. తగినన్ని స్థానాలు గెల్చుకోకపోతే నితీశ్ని బీజేపీ చెత్తబుట్టలోకి తోసేస్తుంది. ‘ఎన్డీఏకి నితీశ్ ప్రతిరూపం వంటివాడని, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి’ అని అమిత్ షా అన్న పదాలకు అర్థం నితీశ్కి బాగా తెలుసు. అది ఎలాంటి విశ్వాసమూ లేకుండానే పునరుద్ధరించే హామీ వంటిది. నమ్రతకు మారుపేరుగా నిలిచిన నితీశ్ మొదటిసారిగా బహిరంగ సభల్లోనే ఉన్నట్లుండి ఆగ్రహ ప్రదర్శన చేస్తున్నారంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. అది ఆయన ఒంటరితనానికి చక్కని వ్యక్తీకరణగా కూడా చెప్పవచ్చు. పరిమితమైన ఆకర్షణా శక్తి, బలహీనమైన రాజకీయ పార్టీ కలిగి ఉన్నప్పటికీ భారతీయ చరిత్రలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక రాజకీయ నేత బహుశా నితీశ్ మాత్రమే కావచ్చు. తన పార్టీకి 20 శాతం ఓట్ల దన్ను మాత్రమే ఉన్నప్పటికీ బిహార్లో ఇప్పటికీ ప్రశ్నించలేని గొప్పనేత ఆయన. 1994లో జార్జి ఫెర్నాండెజ్తో కలిసి లాలూయాదవ్ నుంచి వేరుపడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్దగా ముద్రవేయని జనతాదళ్ (యునైటెడ్) పార్టీని ఈయన ముందుండి నడిపించాడు. ఇద్దరు బలమైన శత్రువుల మధ్య చీలికల నుంచి పుట్టుకొచ్చే ఉప ఉత్పత్తి చందాన నితీశ్ బిహార్ రాజకీయాల్లో అగ్రస్థానంలోకి వచ్చారు. బీజేపీ, ఆర్జేడీలు రెండు భిన్న భావజాలాలతో ఘర్షిస్తూ వచ్చాయి. లాలూయాదవ్ ఆర్జేడీ ప్రబోధించిన మండల్ రాజకీయాలకు పూర్తి వ్యత్యాసంగా బీజేపీ హిందుత్వ కొనసాగుతూ వచ్చింది. మండల్ రాజకీయాలకు చెందిన అసలుసిసలు యోధుడైన నితీశ్ ఇంతకాలంగా బీజేపీ శకటంమీదే ప్రయాణిస్తూ వచ్చారు కానీ బీజేపీ ప్రధాన బ్రాండ్ అయిన హిందుత్వను నితీశ్ స్వీకరించలేదు. బిహార్ చాణక్యుడిలా నితీశ్ రాజకీయ చతురతకు, సహజ జ్ఞానానికి మారుపేరులా గుర్తింపు పొందేవారు. పై రెండు భిన్న పార్టీలకు నిత్యం ఒకరిపైకి మరొకరిని ఎగదోలుతూనే గత 15 సంవత్సరాలుగా బిహార్లో కీలకనేతగా మనగలుగుతూ వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెండు పార్టీలుకూడా నితీశ్ జేడీయూ కంటే పెద్దవే కానీ అన్నివేళలా ద్వితీయ స్థానంలో ఉండిపోవడానికి అంగీకరించేవి. లాలూయాదవ్ను అధికారానికి దూరం పెట్టాలని బీజేపీ కోరుకుంటే, బీజేపీని దూరం పెట్టాలని లాలూయాదవ్ ప్రయత్నించేవారు. ఈ ఇద్దరి వాంఛను నితీశ్ బ్రహ్మాం డంగా నెరవేరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇక చాలు అనే అభిప్రాయానికి వచ్చేసింది. తనకు ఏమాత్రం కాస్త అధికంగా అసెంబ్లీ స్థానాలు దక్కితే నితీశ్ను తోసిపారేసేందుకు కూడా బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈసారి నితీశ్ ఛాయలో మనుగడ సాధించడం కాకుండా తన సొంత దారిలో తాను పయనించాలని బీజేపీ నిర్ణయించేసుకుంది. బీజేపీ ఆకాంక్షను రెండు విషయాలు ప్రజ్వరిల్లచేశాయి. ఒకటి, నితీశ్ ప్రజాదరణ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రతి సర్వే ఈ అంశాన్ని చాటి చెబుతోంది. లోక్నీతి–సీఎస్డీఎస్ సర్వేలో, 43 శాతం మంది ఓటర్లు మళ్లీ నితీశ్ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నట్లు తేలింది. 38 శాతం మంది మాత్రమే ఆయన మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఇక తన రేటింగులను చూస్తే నితీశ్ ప్రజాదరణ మరింతగా పడిపోయింది. 2010లో నితీశ్కు 77 శాతం మంది ఓటర్ల ఆమోదం ఉండేది. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అది 80 శాతానికి పెరిగింది. కానీ ఆ తర్వాతి నుంచి అది తగ్గుతూ 52 శాతానికి పడిపోయింది. మరీ దారుణంగా 2020 ఎన్నికల నాటికి అది 28 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇకపోతే సీ–ఓటర్ సర్వే ప్రకారం చూస్తే, నితీశ్ ప్రభుత్వ పనితీరు పట్ల 25 శాతంమంది మాత్రమే సంతోషం వ్యక్తం చేస్తుండగా, 46 శాతం మంది అసమ్మతి వ్యక్తం చేశారు. నితీశ్ ఇప్పుడు తమకు ఏరకంగానూ విలువైన వ్యక్తి కాదని బీజేపీకి అర్థమైపోయింది. రెండు, 1990ల నుంచి బిహార్ ఎన్నికలను మండల్ యోధులే శాసిస్తూ వచ్చారు. తొలి 15 ఏళ్లలో అంటే 2005 సంవత్సరం వరకు రాష్ట్రంలో మండల్ ఉద్యమానికి లాలూయాదవ్ బలమైన ప్రతినిధిగా ఉండేవారు. అలాంటి లాలూ ఇప్పుడు జైలులో ఉన్నారు. లాలూ కుమారుడు తేజస్వి పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారు. లాలూ యాదవ్ వారసత్వాన్ని మరుగునపర్చి తన సొంత ప్రతిష్టను పెంచుకోవడం కోసం తేజస్వి ప్రయత్నిస్తున్నారు. అణచివేతకు గురైన వెనుకబడిన కులం చైతన్యాన్ని తన తండ్రి లాలూ మేల్కొల్పడం కాదనలేని వాస్తవమని తేజస్వి గుర్తించాడు. తన తండ్రి కారణంగా ఆర్జేడీ సామాజిక పునాది చెక్కుచెదరలేదని తేజస్వికి తెలుసు కానీ ఎన్నికల్లో గెలవడానికి అది మాత్రమే సరిపోదని గ్రహించాడు. కొత్త సామాజిక పునాదిని తాను సృష్టించుకోవాలని, కొత్త ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్న వర్గం విశ్వసనీయతను సాధించుకోవాలని బోధపర్చుకున్నాడు. అందుకే తాను గెలిస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఎన్నికల ఫలితాలను సమూలంగా మార్చగలుగుతుందా అనేది ఇకపై తేలాల్సి ఉంది. నితీశ్ కూడా మండల్ యోధుడే. వెనుకబడిన, పీడిత కులాల సామాజిక, రాజకీయ సాధికారతకు లాలూ బాధ్యుడు కాగా, ఈ సామాజిక బృందం ఆకాంక్షలకు నితీశ్ సాధనమయ్యారు. తన తొలి దఫా పాలనలో లాలూ అరాచకత్వాన్ని అరికట్టడానికి నితీశ్ ప్రయత్నిస్తూనే పీడిత కులాల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కృషి చేశారు. కానీ రెండో దఫా పాలనలో వాటిని పట్టించుకోలేదు. ఇక మూడోదశ పాలన మొత్తం అనిశ్చితి, అనాసక్తతతో గడిచింది. ఈ అన్నింటి పరిణామాల నేపథ్యంలో బీజేపీని వాడుకునే కళలో నితీశ్ రాటుదేలుతూ వచ్చారు. అధికారంలో ఉండటానికి తాను బీజేపీని వాడుకుంటే, మండల్ రాజకీయాల ప్రభావాన్ని తటస్థం చేయాడనికి బీజేపీ నితీశ్ని వాడుకుంది. అంతకుమించి హిందుత్వ రాజకీయాలను నితీశ్ ప్రోత్సహించలేదు. ఇప్పుడు నితీశ్ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే చిరాగ్ పాశ్వాన్ను దరిచేర్చుకుని నీతీశ్ని లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. రాముడికి హనుమాన్ లాగా తాను మోదీని సేవించడానికి సిద్ధమని చిరాగ్ ప్రకటించేశాడు కాబట్టి బీజేపీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన పనిలేదు కూడా. మరి నితీశ్ పరిస్థితి ఏమిటి? బిహార్ రాజకీయాల్లో ఆయన స్థానం వేగంగా పడిపోతోంది. అశుతోష్ – వ్యాసకర్త రచయిత, జర్నలిస్టు -
చర్చల కోసం ఒత్తిడే చైనా లక్ష్యం
సరిహద్దుల్లో భారత బలగాలపై చైనా ఆకస్మిక దాడి 1962 తర్వాత భారత్ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా బలగాలు భారత్ను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమిలో భారత్ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో భారత్ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడింది. ఫలితంగానే భారత్కు ముగుదాడు వేయడం లక్ష్యంగా చైనా సైనిక దాడిని తలపెట్టింది. ఒక అగ్రరాజ్యం స్థాయికి చేరుకున్న చైనా భారత్తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంతో మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్ పేర్కొన్నట్లుగానే భారత్ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఇది భారత్ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు. హెన్రీ కిసింజర్ కంటే ఉత్తమంగా చైనాను మరే దౌత్యవేత్త కూడా అర్థం చేసుకోలేరు. 1962లో భారత్–చైనా యుద్ధ నేపథ్యంలో కిసింజర్ ఒక ఆసక్తికరమైన ఘటనను వర్ణించారు. 1962 అక్టోబర్లో నాటి చైనా అధినేత మావో జెడాంగ్ బీజింగ్లో చైనా అత్యున్నత సైనిక కమాండర్లు, రాజకీయ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చిన ఘటనను కిసింజర్ గుర్తు చేశారు. అది భారతదేశంతో చైనా సైనిక సంఘర్షణలో మునిగి ఉన్న సమయం. ఆనాటి ప్రతిష్టంభనను తేల్చిపడేయాలని మావో నిర్ణయించుకున్నారు. చైనా, భారత్లు శాశ్వత శత్రుత్వంతో అంతరించిపోవని మావో ఆ సమావేశానికి హాజరైన వారితో చెప్పారు. ఇరుదేశాలు మళ్లీ సుదీర్ఘ శాంతి కాలాన్ని గడుపుతాయని, కానీ అలా జరగాలంటే చైనా బలప్రయోగంతో భారత్ను దెబ్బతీసి తిరిగి చర్చల బల్లవద్దకు తీసుకురావాల్సి ఉంటుందని మావో చెప్పారు. ఆ తర్వాతే చైనా అనూహ్యంగా, భారత్ భూభాగంపై విధ్వంసకర దాడికి దిగి మళ్లీ మునుపటి ఆధీన రేఖకు తరలిపోయింది. ఈ క్రమంలో భారత్ నుంచి కైవసం చేసుకున్న భారీ ఆయుధాలను కూడా చైనా వెనక్కు ఇచ్చేసింది. నేడు, చైనా 1962 తర్వాత భారత్ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. గాల్వాన్ లోయలో చైనా బలగాలతో తాజాగా జరిగిన దొమ్మీలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. గాయపడిన సైనికుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తూర్పు లద్దాఖ్లో 60 చదరపు మైళ్ల విస్తీర్ణంలో భారత భూభూగాన్ని చైనా ఆక్రమించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. ఈ సంక్షోభం ఏప్రిల్ నెలలోనే ఉన్నట్లుండి మొదలైంది కానీ భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. చైనా దూకుడు చర్యకు ఒక్క నిర్దిష్ట కారణాన్ని కూడా భారత ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ ఎత్తి చూపలేకపోయారు. చైనా కూడా తన దూకుడు చర్యకు కారణాన్ని ఇప్పటివరౖకైతే వెల్లడించలేదు. కానీ చైనా బలగాలు ప్రదర్శించిన పరమ నిర్లక్ష్య వైఖరి గాభరా కలిగిస్తుంది. ఈ సమస్యకు ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా సైనిక బలగాలు భారత్ను చావు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. ఇరుసైన్యాల కమాండర్ల మధ్య చర్చలు జరిగిన తర్వాత చైనా, భారత బలగాలు కొన్ని కిలోమీటర్ల వెనక్కు తరలిపోయినట్లు సమాచారం. అయితే ఆధీన రేఖను దాటివచ్చింది చైనా బలగాలు అయితే భారత సైనిక బలగాలు ఎందుకు తిరోగమించాయి అన్నది నా అవగాహనకు అందనిది. భారతీయ భూభాగంలోకి ప్రవేశించింది చైనా బలగాలే. దీనివెనుక స్పష్టమైన ఉద్దేశం వెల్లడి కానందున, భారతీయ సైనికులను ఇలా చావుదెబ్బ తీయడం అనేది భారత్పై ఒత్తిడి ప్రయోగించి దాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే జరిగిందని చెప్పవచ్చా? మరి సమస్య ఇదే అయితే చర్చలు దేనిపై జరుపుతారు, ఎందుకు జరపుతారు అనేది మరో ప్రశ్న. గత రెండు వారాలుగా భారత్పై తన ఆగ్రహానికి పలు కారణాలను పేర్కొంటూ చైనా ప్రభుత్వ అధికార వాణి అయిన ది గ్లోబల్ టైమ్స్ సూచనప్రాయంగా తెలుపుతూ వచ్చింది. దీనికి రెండు బలమైన కారణాలు బయటకు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది అమెరికాతో భారత్ సన్నిహితంగా మెలగడం క్రమంగా పెరుగుతోంది. ఇండియా–పసిఫిక్ రీజియన్లో చైనా వ్యతిరేక కూటమిని సృష్టించడానికి భారతదేశం, అమెరికా ప్రయోజనాల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటోందని చైనా బలంగా నమ్ముతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమిలో భారత్ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో అమెరికా తరపున భారత్ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడిపోయింది. తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో హౌడీ మోదీ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్కు గౌరవ ఆహ్వానం పలకడం, అహమ్మదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్కు భారీ ఎత్తున స్వాగతం పలకడం అనేవి చైనాను మండించాయి. భారత్తో అమెరికా మైత్రీ భాషణను చైనా చూస్తూ ఊరుకోలేదని 2020 ఫిబ్రవరి 23వ తేదీనే గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది కూడా. ట్రంప్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పత్రిక అలా రాసిందని మర్చిపోకూడదు. కాగా, 2020 జూన్ 5న గ్లోబల్ టైమ్స్ మరొక వ్యాసం ప్రచురించింది. మోదీ రెండో దఫా పాలనను ప్రారంభించినందున, చైనా పట్ల భారత్ వైఖరి మారిపోయింది. చైనాను లక్ష్యంగా చేసుకుంటున్న అమెరికా పధకాలు చాలావాటిలో భారత్ క్రియాశీలకంగా పాల్గొం టోందని చెప్పడం న్యాయంగా ఉంటుందన్నది ఆ వ్యాససారాంశం. ఆ తర్వాత స్పష్టంగానే చైనా తన వైఖరి గురించి సూచనలు పంపడం మొదలెట్టింది. చైనా హెచ్చరికలను భారత నాయకత్వం పట్టించుకోవలసి ఉండింది. నిస్సందేహంగానే ఒక దేశం ఆదేశాలకు అనుగుణంగా భారత్ వంటి సౌర్వభౌమాధికారం కలిగిన దేశం తన విదేశీ విధానాన్ని నిర్వహించుకోవడం వంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కానీ తన పొరుగునే ఉన్న చైనా వంటి శక్తివంతమైన దేశం అభిప్రాయాలను భారత్ విస్మరించలేదన్నది కూడా వాస్తవమే. రెండు, జమ్మూ కశ్మీర్ భౌగోళిక ముఖచిత్రాన్ని మార్చివేయడానికి మోదీ ప్రభుత్వం తలపెట్టిన ప్రయత్నం చైనా నాయకత్వానికి ఇష్టం లేదు. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, లద్దాక్లోని అక్సాయి చిన్ని కూడా భారత్ తన భూభాగంగా చూస్తోందని చెప్పడం చైనాను రెచ్చగొట్టింది. ఈ విషయమై చైనా సీనియర్ అధికారి వాంగ్ షిదా ఇటీవలే ఒక వ్యాసం రాశారుకూడా. ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్తాన్, చైనాల సార్వభౌమాధికారానికి తీవ్ర సవాలుగా నిలిచిందని వాంగ్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్కు చైనా బలంగా మద్దతునివ్వడం ప్రారంభించింది. చైనా ఒత్తిడి కారణంగానే గత 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశం లాంఛనప్రాయంగా చర్చకు వచ్చింది. కాబట్టి, భారత భూభాగంలోని గాల్వన్ లోయ వంటి ప్రాంతాల్లోకి చైనా దళాలు ప్రవేశించడం అనేది సాధారణమైన ఘటన కాదని, ఆ దేశానికి ఇంకా పెద్ద కారణాలు ఉన్నాయనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. దీనికి అనుగుణంగానే భారతదేశం తన దౌత్యాన్ని నిర్వహించుకోవలసి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీకి తప్పు సలహాలు ఇచ్చినట్లు కనబడుతోంది. చైనా అగ్రనాయకత్వాన్ని సంతృప్తిపరచడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదు. ఇప్పుడు ఆధీనరేఖలో భారతీయ సైనికుల హత్యా ఘటనతో ప్రధాని తన పదవీ బాధ్యతలను నిర్వహించడం కష్టమవుతుంది. పైగా మితిమీరిన జాతీయవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని జపిస్తున్న తన పార్టీలోని సైద్ధాంతిక శ్రేణులు కాని, బయటి శక్తులు కానీ ఇప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను మాత్రమే ఇప్పుడు సరైన పరిష్కారమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ ఒత్తిడికి లోబడకపోతే మోదీ నాయకత్వంపై వీరు దాడి చేయవచ్చు కూడా. అయితే ఇక్కడ వివాదాస్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందా? రెండు కారణాలతో ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం అని చెప్పాల్సి ఉంటుంది. మొదటిది, చైనా తన సైనిక చర్యల సమయాన్ని అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంది. భారత్ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్లో ఉన్నప్పుడు, కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థతో తలమునకలై ఉన్నప్పుడు భారతీయ భూభాగంలోకి చైనా అడుగుపెట్టింది. రెండు, చైనా ప్రతి సంవత్సరం 261 బిలియన్ డాలర్లు రక్షణరంగంపై వెచ్చిస్తుండగా, భారత్ 71 బిలియన్ డాలర్లను మాత్రమే రక్షణ రంగంపై వెచ్చిస్తోంది. 2000 సంవత్సరం నుంచి చైనా పకడ్బందీ పథకం అమలు చేస్తూ 2049 నాటికల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయాలని కంకణం కట్టుకుంది. ఇక బీజేపీ నాయకులు, మద్దతుదారుల విషయానికి వస్తే మోదీ నాయకత్వంలోని భారత్ 1962 నాటి నెహ్రూ పాలన నాటి భారత్లా లేదని గర్వంగా ప్రకటిస్తున్నారు. జాతీయ టీవీ చానెల్స్ కూడా ఇలాంటి వాణినే డాంబికంగా ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు ఆకర్షణీయంగానే ధ్వనించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే నేడు చైనా ఒక అగ్రరాజ్యం. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావితంగా ఉంటున్న అమెరికాను ఆ స్థానం నుంచి తొలగించాలనే స్పష్టమైన ఆకాంక్షతో చైనా ముందుకెళుతోంది. పైగా భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశం. సరిహద్దు ఘర్షణలను తగ్గించడానికి దౌత్యపరమైన, తెరవెనుక చర్చలపైనే భారత్ ఆధారపడాలి. భారత్తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంలో చైనా మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్ పేర్కొన్నట్లుగానే భారత్ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇది భారత్ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు. అశుతోష్ వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత -
మహీంద్రా కొత్త ఈక్విటీ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ‘టాప్ 250 నివేష్ యోజన’ పేరుతో కొత్త ఈక్విటీ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీం డిసెంబరు 6న ప్రారంభమై అదే నెల 20న ముగుస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో 80 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ఎండీ అశుతోష్ బిష్ణోయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల్లో 65 శాతం వరకు ఈ పెట్టుబడి ఉంటుందని చెప్పారు. 20 శాతం వరకు డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. కంపెనీ నుంచి ఇది ఎనిమిదవ పథకం. మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏడు ఈక్విటీ పథకాల్లో రాబడులు 17–20 శాతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆశుతోష్ పార్టీని వీడి వారం గడవక ముందే మరో నేత ఆశిష్ ఖేతన్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆగస్ట్ 15నే ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పంపినట్లు అశిష్ ఖేతన్ ప్రకటించారు. తాను లీగల్ ప్రాక్టీస్ చేసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్రీయాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు బుధవారం సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రభుత్వ సలహా మండలైన ఢిల్లీ డైలాగ్ డెవలప్మెంట్ కమిషన్ నుంచి గత ఏప్రీల్లోనే ఖేతన్ వైదొలిగిన విషయం తెలిసిందే. జర్నలిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఖేతన్ ఆప్ ఏర్పడిన మొదటిలోనే పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2014 లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి.. బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ చేతిలో ఓటమిపాలైయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్నారని, దానికి పార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్ నేతల రాజీనామాలు ఆప్ను కలవరపెడుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement