ప్రారంభమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే | N Convention centre survey by serilingampally tahsildar | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే

Sep 26 2014 10:46 AM | Updated on Jul 21 2019 4:48 PM

ప్రారంభమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే - Sakshi

ప్రారంభమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే

ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే శుక్రవారం ప్రారంభమైంది. తమ్మిడికుంట చెరువు చేరుకున్న ఇరిగేషన్ అదికారులు చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించనున్నారు.

హైదరాబాద్ : ఎన్ కన్వెన్షన్ సెంటర్ సర్వే శుక్రవారం ప్రారంభమైంది.   తమ్మిడికుంట చెరువు చేరుకున్న ఇరిగేషన్ అధికారులు  చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించనున్నారు.  దాదాపు రెండున్నర నెలల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అక్రమ నిర్మాణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొనడం తెలిసిందే. సెంటర్ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లడం... జీహెచ్‌ఎంసీ నిబంధనలు, చట్టం మేరకు అధికారులు చర్యలు తీసుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్వొకేట్ జనరల్(ఏజీ) సలహా కోరారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని దాని యాజమాన్యం వాదిస్తున్నందున వారి సమక్షంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరోమారు సర్వే చేయించి ఎఫ్‌టీఎల్ నిర్ధారించాల్సిందిగా ఏజీ సూచించారు. ఆ మేరకు చర్యలకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకనుగుణంగా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి నోటీసులిచ్చి... వారి సమక్షంలో ఎఫ్‌టీఎల్ నిర్ధారించనున్నారు. అనంతరం అంశాల వారీగా ఉల్లంఘనలను తెలియజేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement