- ఎత్తిపోతల పథకం భూసేకరణలో తీవ్ర జాప్యం
- 26,582 ఎకరాలకు సేకరించింది 12,350 ఎకరాలే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథక ం పనులకు భూసేకరణ సమస్య బ్రేక్ వేస్తోంది! పనులు ఆరంభించి నాలుగు నెలలు కావొస్తున్నా భూసేకరణ అంశం కొలిక్కి రాకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. సేకరణ పూర్తయిన కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్నా.. మిగతా చోట్ల కాంట్రాక్టు సంస్థలు తమ యంత్రాలను ఖాళీగా ఉంచుతున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి సరైన సహకారం లేదని, అందుకే పనులు నెమ్మదిస్తున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు.
సగం కూడా కాని భూసేకరణ
మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12.32 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ఐదు రిజర్వాయర్ల పరిధిలో పంప్హౌస్లు, కాల్వలు, టన్నెళ్ల నిర్మాణానికి 26,582.28 ఎకరాలు కావాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,075.33 ఎకరాలు కాగా, పట్టాభూమి 22,506.35 ఎకరాలు ఉంది. ఇందు లో ఇప్పటివరకు 13,081.13 ఎకరాల భూమిని ఇచ్చేందుకు 5,256 మంది రైతులు ముందుకు వచ్చారు.
మొత్తంగా రెవెన్యూ అధికారులు 12,350.12 ఎకరాలు సేకరిం చగా.. అందులో పట్టాభూమి 8,371.38 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,978.14 ఎకరాలు ఉంది. అంటే ఇప్పటివరకు మొత్తం సేకరిం చాల్సిన భూమిలో సగం కూడా పూర్తికాలేదు. నాలుగు నెలల కింద ప్రాజెక్టు పనులు ఆరంభం అయ్యేనాటికే 9,300 ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించింది 3 వేల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. భూసేకరణ సమస్య కారణంగా ప్రధాన ప్యాకేజీల పనులు నిలిచిపోయాయి. మరి కొన్ని చోట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పనులు నెమ్మదించినా.. అక్టోబర్ నుంచి వేగవంతం చేయాలని ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది.
‘పాలమూరు’ పల్టీలు!
Published Mon, Aug 29 2016 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement