వామపక్ష ఉద్దండులు ప్రేక్షకులైన వేళ.. | Left uddandulu if the target audience .. | Sakshi
Sakshi News home page

వామపక్ష ఉద్దండులు ప్రేక్షకులైన వేళ..

Mar 25 2016 1:45 AM | Updated on Sep 3 2017 8:29 PM

వామపక్ష ఉద్దండులు ప్రేక్షకులైన వేళ..

వామపక్ష ఉద్దండులు ప్రేక్షకులైన వేళ..

వారు వామపక్ష ఉద్దండులు, ప్రముఖులు... ప్రేక్షకుల్లా కూర్చుని కన్హయ్యకుమార్ ప్రసంగం విన్నారు.

హైదరాబాద్: వారు వామపక్ష ఉద్దండులు, ప్రముఖులు... ప్రేక్షకుల్లా కూర్చుని కన్హయ్యకుమార్ ప్రసంగం విన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్గవర్గ సభ్యులు అజీజ్‌పాషా, కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు చెరుపల్లి సీతారామయ్య, నంద్యాల నర్సింహారెడ్డిలతో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరుల సాధారణ కార్యకర్తల్లాగా ప్రేక్షకుల్లో కూర్చుని కన్హయ్య ప్రసంగాన్ని విన్నారు. వేదికపై మల్లేపల్లి లక్ష్మయ్య మినహా వామపక్ష విద్యార్థి సంఘాల జాతీయ, రాష్ట్ర నేతలకే అవకాశం కల్పించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement