గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం పుస్తకావిష్కరణ | jairam ramesh book release programme in hyderabad | Sakshi
Sakshi News home page

గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం పుస్తకావిష్కరణ

Jul 17 2016 7:15 PM | Updated on Sep 4 2017 5:07 AM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. 'గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం' పేరుతో రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్, 'సాక్షి' ఈడీ కే రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే విభజనకు అర్థముంటుందన్నారు. హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్కు ఆత్మహత్యాసదృశమే అని జైరాం రమేష్ పేర్కొన్నారు.

అయితే.. డిసెంబర్ 9 ప్రకటన తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఎందుకు వెనక్కిపోయిందో జైరాం రమేష్ రాయలేదని కే రామచంద్రమూర్తి అన్నారు. ఇకపోతే.. అదిష్టానాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ అతణ్ని సీఎం పదవి నుంచి ఎందుకు తొలగించలేదో కూడా జైరాం రమేష్ చెప్పలేదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement