ఐపీఎస్ ట్రైనీల కొత్త కోర్సు ప్రారంభించిన కేంద్రమంత్రి | IPS trainees new course Launched Union Minister Kiren Rijiju | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ ట్రైనీల కొత్త కోర్సు ప్రారంభించిన కేంద్రమంత్రి

Jun 13 2015 1:16 AM | Updated on Sep 3 2017 3:38 AM

ఐపీఎస్‌ల శిక్షణలో భాగంగా 3వ కౌంటర్ టైజం కోర్సును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం ప్రారంభించారు.

 సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల శిక్షణలో భాగంగా 3వ కౌంటర్ టైజం కోర్సును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ భద్రతతో పాటు అంతర్గత రక్షణ కూడా అత్యంత ఆవశ్యకరమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారుల ట్రైనింగ్‌లో కౌంటర్ టైజం అత్యంత ప్రాధాన్యమున్న అంశమని వివరించారు. అంతర్గత భద్రత విషయంలో ఐపీఎస్‌ల బాధ్యత ఎంతో ఉందని చెప్పారు. కాగా, కొత్తగా నిర్మించిన ఆఫీసర్స్ క్లబ్‌ను ఆయన ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement