స్కూల్ లో బెంచీలు తుడిచిన గవర్నర్ | Governor couple participate in swachh bharat programme | Sakshi
Sakshi News home page

స్కూల్ లో బెంచీలు తుడిచిన గవర్నర్

Oct 2 2014 9:26 AM | Updated on Aug 21 2018 11:41 AM

గవర్నర్ నరసింహన్ దంపతులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌భవన్ కాలనీలో ఏర్పాటు చేసిన ...

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ దంపతులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌భవన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ దంపతులు గురువారం ఉదయం పాల్గొని రోడ్డును ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే.  రాజ్‌భవన్ కాలనీలోని ఓ స్కూల్‌, కమ్యూనిటీ హాలులో బెంచీలు తుడిచారు.. ఉద్యోగులు చేత  క్లీన్‌ ఇండియా ప్రమాణం చేయించారు.

 

స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని నరసింహన్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్నినిర్మిద్దామని ఆయన కోరారు.  క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ మన టార్గెట్ కావాలని నరసింహన్ సూచించారు.  ప్రతి ఒక్కరూ తమ చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు శ్రమదానం చేయడం వల్ల పరిశుభ్రమైన భారత్‌ను సాధించేందుకు వీలుపడతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement