భాగ్యనగరి తొలి పోస్టాఫీస్ | GHMC Electons special | Sakshi
Sakshi News home page

భాగ్యనగరి తొలి పోస్టాఫీస్

Jan 17 2016 5:34 AM | Updated on Sep 3 2017 3:48 PM

భాగ్యనగరి తొలి పోస్టాఫీస్

భాగ్యనగరి తొలి పోస్టాఫీస్

హైద్రాబాద్ నగరంలో మొట్టమొదటి పోస్టాఫీస్‌ను 1866 మార్చి 14న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఏర్పాటు చేశారు.

హైద్రాబాద్ నగరంలో మొట్టమొదటి పోస్టాఫీస్‌ను 1866 మార్చి 14న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్వాల్ రైతుబజార్‌కు ఎదురుగా రాష్ట్రపతి నిలయం పక్కనే ఉందీ పోస్టాఫీస్. శతాబ్దిన్నరకు పైగా స్థానికులకు విశిష్ట సేవలందించిన ఘనత ఈ పోస్టాఫీస్‌ది. నిజాం హయాంలో బ్రిటీష్ పాలకులు తమ సమాచార సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. తొలిసారిగా టెలిగ్రాఫ్ సౌకర్యం కూడా ఇక్కడే నెలకొల్పారు. స్వాతంత్య్రం అనంతరం ఈ పోస్టాఫీస్ శాఖ భారత ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ఘన చరిత్ర గల ఈ పోస్టాఫీస్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ డాక్ సేవా అవార్డు కూడా లభించింది.        - బన్సీలాల్‌పేట్

Advertisement
 
Advertisement
Advertisement