డీఎడ్ అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి
Apr 15 2017 1:44 PM | Updated on Sep 5 2017 8:51 AM
హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో డీఎడ్ అభ్యర్థులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. డీఎడ్ అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం మధ్యాహ్నం కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న డీఎడ్ అభ్యర్థులు ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకొని నిరసనకారులను అరెస్ట్ చేశారు.
Advertisement


