కాపుల రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ఆరా | BJP bosses inquired Kapus reservations | Sakshi
Sakshi News home page

కాపుల రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ఆరా

Feb 4 2016 4:16 AM | Updated on Mar 29 2019 9:31 PM

కాపులను బీసీలుగా గుర్తించాలంటూ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది.

సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీలుగా గుర్తించాలంటూ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ రెండు రోజుల కిందటే కాపుల రిజర్వేషన్ల పూర్వాపరాలపై నివేదిక పంపాలంటూ రాష్ట్ర నేతలకు సూచించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇందుకు సంబంధించిన వివరాలతో పాటు తునిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ ఒక నివేదికను జాతీయ నాయకత్వానికి పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement