టీఆర్‌ఎస్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు | Anti-people policies of TRS Government | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు

Aug 27 2016 1:08 AM | Updated on Sep 4 2017 11:01 AM

టీఆర్‌ఎస్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు

టీఆర్‌ఎస్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని టీ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని టీ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మాట్లాడారు. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి మరీ మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పెద్దిరెడ్డి విమర్శించారు. విమర్శలు చేస్తే కేసులు పెట్టిస్తామని సీఎం కేసీఆర్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో గవర్నర్‌ను సంప్రదిస్తామని చెప్పారు. గోదావరి ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయారని రావుల విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement