సచివాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులు | AISF leaders secretariat Blockade for mess bills | Sakshi
Sakshi News home page

సచివాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులు

Jul 15 2015 7:11 PM | Updated on Apr 3 2019 4:37 PM

మెస్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్: మెస్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులను సచివాలయం బయటే అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement