ఎస్ఐ వేధింపులతో విషం తాగి టవరెక్కాడు | man suicide attempt in ysr district due to police harrasment | Sakshi
Sakshi News home page

ఎస్ఐ వేధింపులతో విషం తాగి టవరెక్కాడు

Oct 15 2015 11:47 AM | Updated on Aug 29 2018 8:38 PM

పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ జిల్లా లింగాలకు చెందిన ఒక కూలీ గురువారం ఉదయం పురుగుల మందు తాగి టవర్ ఎక్కాడు.

లింగాల : పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ జిల్లా లింగాలకు చెందిన ఒక కూలీ గురువారం ఉదయం పురుగుల మందు తాగి టవర్ ఎక్కాడు. వివరాలు లింగాలకు చెందిన నారాయణరెడ్డి (35)పై  వివాహేతర సంబంధం విషయమై ఒక వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ మేరకు లింగాల పోలీసులు నారాయణరెడ్డిని స్టేషన్‌కు పిలిపించి పగలంతా స్టేషన్‌లో ఉంచి రాత్రిపూట వదిలేవారు. పైగా ఎస్ఐ వేధింపులకు గురి చేసేవారని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

దాంతో అతను పనులకు వెళ్లక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువడంతో మనస్థాపం చెందిన నారాయణరెడ్డి ఈ రోజు ఉదయం తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగాడు. తర్వాత అక్కడే ఉన్న  బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అతణ్ణి దించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. నారాయణ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement