
నగరంలో ‘వైస్-2014’
హైదరాబాద్ నగరంలో త్వరలోనే ‘విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంటర్ప్రెన్యూర్షిప్’- ‘వైస్-2014’ కార్యక్రమం జరగనుంది.
హైదరాబాద్ నగరంలో త్వరలోనే ‘విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంటర్ప్రెన్యూర్షిప్’- ‘వైస్-2014’ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు కాన్ఫెడరేషన్స్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ (సీఓడబ్ల్యూఈ) గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్రమంజల్లోని ఎన్కేఎంస్ గ్రాండ్లో సమావేశం ఏర్పాటు చేస్తోంది. సీఓడబ్ల్యూఈ అధ్యక్షురాలు సౌదామిని ఈ వివరాలను వెల్లడిస్తారు.