వైఎస్‌కు నచ్చిన శ్లోకం | Shloka Liked By YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌కు నచ్చిన శ్లోకం

Sep 2 2019 3:13 AM | Updated on Sep 2 2019 3:13 AM

Shloka Liked By YS Rajasekhara Reddy - Sakshi

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయత్త సంత్రస్థులై
ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌
ధీరుల్‌ విఘ్ననిహస్య మానులగుచున్‌ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌

భర్తృహరి నీతిశతకంలోని ఈ సుభాషితం (తెలుగు: ఏనుగు లక్ష్మణ కవి) వైఎస్‌కు ఇష్టమైన శ్లోకం. దీని అర్థం: ఆటంకాలు ఎదురవుతాయేమోనన్న భయంతో అధములు అసలు పనే మొదలుపెట్టరు. మధ్యములు పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురుకాగానే వదిలేస్తారు. ఇక ధీరులు ఎన్నెన్ని ఆటంకాలు ఎదురైనా మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేదాకా వదిలిపెట్టరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement