తియ్యటి కబురు
సాహిత్య మరమరాలు
1960లో విడుదలైన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి ఆత్రేయ రచయిత. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, శాంతకుమారి నటించిన ఈ మూడు గంటల సినిమాకు పి.పుల్లయ్య దర్శకుడు. ప్రేక్షకులు దేవుడిలా దండం పెట్టేంత ఇమేజ్ ఎన్టీఆర్కు ఇచ్చింది ఈ చిత్రం. అందులో ఒక చోట ‘కబురు’ అనే మాట వస్తుంది. ఖబర్ అనే ఉర్దూ మాట నుంచి ఈ కబురు అనే మాట పుట్టింది. ఈ ‘పొరపాటు’కు ఆత్రేయ నొచ్చుకున్నారు. ‘అయ్యో, పౌరాణిక చిత్రంలో కబురు అనే మాట వాడానే’ అని తన అసమర్థతకు విలపించారు. ఇదే సంగతిని ఓసారి గీత రచయిత, కథకుడు అయిన మల్లాది రామకృష్ణశాస్త్రితో చెప్పుకుని బాధపడ్డారు. ‘వేంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లాడాడు కదా, అంటే ఆ కాలంలో ఉరుదూ ఉన్నట్టే, అప్పుడు కబురు అనే మాట తప్పు ఎలా అవుతుంది?’ అని సాంత్వన వచనాలు పలికారు రామకృష్ణశాస్త్రి. అప్పుడుగానీ ఆత్రేయ మనసు కుదుటపడలేదు.