'నన్నెవరూ కొట్టలేదు.. త్వరలో ఆంధ్రజ్యోతిపై చర్యలు' | no body attacked me, says kondeti sridhar | Sakshi
Sakshi News home page

'నన్నెవరూ కొట్టలేదు.. త్వరలో ఆంధ్రజ్యోతిపై చర్యలు'

May 3 2014 3:14 PM | Updated on Aug 14 2018 4:24 PM

కాంగ్రెస్ నాయకుడు వరద రాజేశ్వరరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనను కొట్టారనడం అవాస్తవమని వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు వరద రాజేశ్వరరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనను కొట్టారనడం అవాస్తవమని వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ తెలిపారు. తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచి ఆయన వివరణ ఇచ్చారు.

తాను కొంతమంది నేతల ఒత్తడి తట్టుకోలేకపోయానని ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతి పత్రిక డబ్బుల కోసం వరద రాజేశ్వరరావుపైన, తనపైన ఒత్తిడి తెచ్చిందని, తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే వాళ్లపై చర్యలు తీసుకుంటానని కొండేటి శ్రీధర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement