వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే జయమణి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే జయమణి

Published Wed, Mar 26 2014 2:44 AM

వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే జయమణి - Sakshi

రేపు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక
 సీతానగరం(విజయనగరం), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి తెలిపారు. మంగళవారం ఆమె సీతానగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గురువారం పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తీరుతో మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థారుులో అందాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. వైఎస్ జగన్‌తోనే సాధ్యమని తెలిపారు.

Advertisement
Advertisement