'తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే' | D srinivas takes on kcr | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే'

Apr 21 2014 9:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

'తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే' - Sakshi

'తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే'

తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ క్యాష్ చేసుకున్నారని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి డీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ : తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ క్యాష్ చేసుకున్నారని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి డీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆయన  విలేకర్లతో మాట్లాడుతూ డిసెంబర్ 9 ప్రకటన రాకపోతే కేసీఆర్ అడ్రస్ గల్లంతు అయ్యేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కడే లేడని, ఉద్యమంలో చాలామంది మమేకం అయ్యారని డీఎస్ అన్నారు.

 కేసీఆర్, టీఆర్ఎస్ పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తోందన్నారు. అసలు తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని తానేనని డీఎస్ చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం మొదట అసెంబ్లీలో మూడు గంటల పాటు మాట్లాడింది తానేనన్నారు. ఎమోషనల్ ఇష్యూస్ని అడ్వాంటేజ్గా తీసుకొని, సెంటిమెంట్ను సొమ్ము చేసుకుంటున్న కేసీఆర్కు ఈసారి తెలంగాణ ప్రజలు ప్రతికూలమైన తీర్పు ఇవ్వబోతున్నారని డీఎస్ జోస్యం చెప్పారు.  కాగా నేడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు డిచ్పల్లి మండలం సాంపల్లిలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement