తేలనున్న మాజీ హోం తనయుల భవితవ్యం | Competition Between Veerender Goud And Karthik Reddy in chevella | Sakshi
Sakshi News home page

తేలనున్న మాజీ హోం తనయుల భవితవ్యం

May 16 2014 6:47 AM | Updated on Mar 28 2018 10:56 AM

పోటాపోటీగా జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హేమాహేమీలతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ హోం మంత్రుల తనయుల భవితవ్యం కూడా తేలనుంది.

హైదరాబాద్ : పోటాపోటీగా జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హేమాహేమీలతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ హోం మంత్రుల తనయుల భవితవ్యం కూడా తేలనుంది.  చేవెళ్ల నుంచి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉండగా, టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్ పోటీలో ఉన్నారు.  ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఇక కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడే...
 కౌంటింగ్ కేంద్రం         ...........                        నియోజకవర్గాలు
 డీఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజీ,  ...........                  మేడ్చల్, మల్కాజిగిరి,
 బౌరాంపేట్, కుత్బుల్లాపూర్   .........                    కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి
 సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం  .......                     ఉప్పల్, ఎల్బీనగర్
 శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ .........                ఇబ్రహీంపట్నం
 అండ్ టెక్నాలజీ, శేరిగూడ
 వీఎం హోం, సరూర్‌నగర్         .........               మహేశ్వరం
 జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి   .....     రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి
 ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేవెళ్ల  ..........           చేవెళ్ల
 మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్  ........    వికారాబాద్, తాండూర్
 
 

Advertisement
 
Advertisement
Advertisement