టీడీపీ హామీలపై ఈసీకి 'ఆప్' ఫిర్యాదు | Aam aadmi party Complaint to Election Commission on TDP Promises | Sakshi
Sakshi News home page

టీడీపీ హామీలపై ఈసీకి 'ఆప్' ఫిర్యాదు

Apr 3 2014 6:08 PM | Updated on Aug 14 2018 4:32 PM

టీడీపీ హామీలపై ఈసీకి 'ఆప్' ఫిర్యాదు - Sakshi

టీడీపీ హామీలపై ఈసీకి 'ఆప్' ఫిర్యాదు

టీడీపీ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తుందంటూ ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: టీడీపీ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తుందంటూ ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఇస్తున్న రుణమాఫీ హామీలు ప్రజలను ప్రలోభపెట్టేవిగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. హామీలు నెరవేర్చడం ఎలా ఆచరణ సాధ్యమో చెప్పకుండా టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టింస్తోందని ఆరోపించారు.

టీడీపీ తన హామీల ద్వారా రైతులు, మహిళలు రుణాలు చెల్లించవద్దని పిలుపునివ్వటం దారుణమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకొని టీడీపీ ఇస్తున్న ఆచరణ సాధ్యంకాని హామీలకు అడ్డుకట్టవేయాలని  ఆమ్ ఆద్మీ పార్టీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement