జిల్లాలోని రెండు లోక్ సభ, 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధిం చి మొత్తం180 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ ఎం పీ నియోజకవర్గ స్థానం లో 10 మంది, మహబూబాబాద్లో 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
వరంగల్, న్యూస్లైన్ : జిల్లాలోని రెండు లోక్ సభ, 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధిం చి మొత్తం180 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ ఎం పీ నియోజకవర్గ స్థానం లో 10 మంది, మహబూబాబాద్లో 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
ఈ రెం డు లోక్సభ స్థానాల్లో మొత్తం 27 మంది బరిలో నిలిచారు. ఇక 12 శాసనసభ స్థానాలకు మొత్తం 153 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా జనగామ నుంచి 19 మంది అత్యల్పంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది అభ్యర్ధులు బరిలో మిగిలారు.