వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
⇒ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు
⇒ కేక్ కట్చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన జగన్మోహన్రెడ్డి
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి రెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలసి పాస్టర్ రెవరెండ్ బెనహర్బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలోని భక్తుల మధ్య కేక్ కట్ చేసి రాయలసీమ సీఎస్ఐ డయాసిస్, బిషప్ రెవరెండ్ డాక్టర్ బి.డి.ప్రసాదరావు, పెదనాన్న వైఎస్ ప్రకాష్రెడ్డి, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిలకు తినిపించారు.
అనంతరం పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. చర్చిలో ఉన్న వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలం దరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిం చారు. అంతకుమునుపు వేదికపై వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్రెడ్డిలు బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించారు. ప్రార్థనలో వైఎస్ కుటుంబ సభ్యులు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి దంపతులు, ైవె ఎస్ మేనత్త కమలమ్మ, వైఎస్ జగన్ మామ డాక్టర్ ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ అనిల్రెడ్డి, వైఎస్ సునీల్రెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ఎస్.బి.అంజాద్ బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్బాబు క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
చిన్నారికి నామకరణం
పులివెందులలోని చర్చి ఆవరణలో గంగా భవాని, యోహాన్ దంపతుల కుమార్తెకు విజయమ్మ అని వైఎస్ జగన్ పేరు పెట్టారు. జగన్ చేతుల మీదుగా నామకరణం చేయించాలని చాలా రోజులుగా ఎదురు చూశామని, ఇపుడు ఆ కోరిక నెరవేరిందని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. క్రిస్మస్ రోజున నామకరణం జరగడంతో వారు ఉప్పొంగిపోయారు.