తాగిన మత్తులో భార్యను కత్తితో పొడిచాడు | women murdered in kurnool district | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో భార్యను కత్తితో పొడిచాడు

Aug 10 2016 4:49 PM | Updated on Sep 4 2017 8:43 AM

తాగిన మత్తులో భార్యను హత్యచేశాడో వ్యక్తి.

తుగ్గలి: తాగిన మత్తులో భార్యను హత్యచేశాడో వ్యక్తి. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన గురుమూర్తి తాగిన మత్తులో భార్య అంజనమ్మ(50)ను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. మద్యానికి బానిసైన గురుమూర్తి తరుచూ భార్యతో గొడవపడేవాడు. బుధవారం పీకలదాకా తాగివచ్చిన అతన్ని భార్య అంజనమ్మ నిలదీసింది. దాంతో కోపోద్రిక్తుడైన  గురుమూర్తి కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement