కట్నం వేధింపులకు గృహిణి బలి | woman suicide for dowry harrasment | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు గృహిణి బలి

Aug 28 2016 11:25 PM | Updated on Nov 6 2018 8:04 PM

పూజిత (ఫైల్‌) - Sakshi

పూజిత (ఫైల్‌)

కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ గృహిణి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది.

ఉప్పల్‌: కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ గృహిణి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఉప్పల్‌ పోలీసు కథనం ప్రకారం.. రామంతాపూర్‌ రాంరెడ్డినగర్‌కు చెందిన రాజేందర్‌సింగ్‌కు బళ్లారికి చెందిన పూజిత ఠాగూర్‌(24)తో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఏడాదిన్నర వయసు బాబు ఉన్నాడు. రెండేళ్లుగా భర్త అదనపు కట్నం కోసం పూజితను వేధిస్తున్నాడు.

వీటిని భరించలేక రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం పూజిత మృతి చెందింది. అదనపు కట్నం కోసం అల్లుడు రాజేందర్‌సింగ్,అతడి తల్లి వేధించడంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పూజిత తల్లిదండ్రులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement