‘సాక్షి’ మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ | 'Witness' tailoring training under the auspices of the Women's Alliance | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ

Jul 31 2016 12:09 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది.

హన్మకొండ చౌరస్తా : సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. నెలరోజుల పాటు కొనసాగే శిక్షణ తరగతులు ఆదివారం మినహా మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో బ్యాచ్‌కు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్‌ కోసం ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేరీ క్యాండిల్స్, బాలహనుమాన్‌గుడి దగ్గర, బస్టాండ్‌రోడ్, హన్మకొండ చిరునామాలో రూ. 2500 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. శిక్షణ తరగతులకు వచ్చే అభ్యర్థులు పెద్ద స్కేలు, టేప్, కత్తెర, మార్కర్, దారం రీలు, బ్లౌజ్‌ పీసులు, సూదులు, న్యూస్‌పేపర్, నోట్‌బుక్స్, పెన్నులను వెంట తెచ్చుకోవాలి. మెథడ్‌ ఆఫ్‌ కటింగ్, సాదా బ్లౌజ్, మెథడ్‌ ఆఫ్‌ స్టిచ్చింగ్, డ్రెస్‌ పెట్టికోట్, క్రాస్‌కట్‌ బ్లౌజ్, కటోరీ బ్లౌజ్, శారీ పెట్టికోట్, డబుల్‌ కటోరీ బ్లౌజ్‌ వి షేప్‌ ప్రాక్, ప్రిన్స్‌ కట్‌ బ్లౌజ్, అంబరిల్లా ఫ్రాక్, స్కట్‌ అండ్‌టాప్, గాగ్రాచోళీ, స్లీవ్‌ డిజైన్‌బ్లౌజ్, డిఫరెంట్‌ హ్యాండ్స్‌బ్లౌజ్, లాంగ్‌ లెంత్‌ డ్రెస్, ఫప్‌ హ్యాండ్స్‌ బ్లౌజ్‌లో శిక్షణ తరగతులు ఉంటాయి. పూర్తి వివరాలకు సెల్‌: 95055–14424 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement