'మేం వైఎస్ జగన్తోనే ఉంటాం' | vizianagaram ysrcp mlas fires over party shifting news | Sakshi
Sakshi News home page

'మేం వైఎస్ జగన్తోనే ఉంటాం'

Feb 22 2016 6:24 PM | Updated on Oct 30 2018 5:17 PM

'మేం వైఎస్ జగన్తోనే ఉంటాం' - Sakshi

'మేం వైఎస్ జగన్తోనే ఉంటాం'

పార్టీ మారుతారన్నట్లు వచ్చిన వార్తలను సాలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర తీవ్రంగా ఖండించారు.

విజయనగరం: పార్టీ మారుతారన్నట్లు వచ్చిన వార్తలను సాలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర తీవ్రంగా ఖండించారు. కొన్ని ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటామని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ నేతలు  మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ నేతలు ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకోవాలని రాజన్నదొర హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement