ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవాలి | utilize internet servcies | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవాలి

Aug 24 2016 1:53 AM | Updated on Sep 4 2017 10:33 AM

ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవాలి

ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రజలందరూ ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవాలని జేసీ–2 సాల్మన్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. Mýృష్ణాపుష్కరాల నేపథ్యంలో స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న చర్చావేదికలో మంగళవారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఈ పాస్‌ విధానంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.

  •  జేసీ–2 రాజ్‌కుమార్‌
  • నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):
    ప్రజలందరూ ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవాలని జేసీ–2 సాల్మన్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. Mýృష్ణాపుష్కరాల నేపథ్యంలో స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న చర్చావేదికలో మంగళవారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఈ పాస్‌ విధానంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇంటర్నెట్‌ సేవలపై ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వ సేవలు, సదుపాయాలు ఇంటర్నెట్‌ ద్వారా ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్య సైతం ఆన్‌లైన్‌లో అందిస్తున్నారన్నారు. ఈ పాస్‌ విధానం వల్ల నిత్యావసరాల పంపిణీ, సామాజిక పింఛన్లు అందజేసే విధానం అమల్లోకి వచ్చిందన్నారు. డీఎస్‌ఓ ధర్మారెడ్డి, ఏపీఆన్‌లైన్‌ ఎస్‌సీఏ వంశీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement