-
ఎయిడ్స్ రహిత జిల్లాగా కృషి
నెల్లూరు(బారకాసు): 2030 నాటికి ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏజేసీ రాజ్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్హాల్లో నిర్వహించిన సభలో ఏజేసీ మాట్లాడారు. జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి కాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన అందరి బాధ్యత అని చెప్పారు. ఈవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామన్నారు. అనంతరం ఎయిడ్స్పై పనిచేస్తున్న ఎనిమిది స్వచ్ఛందసంస్థల నిర్వాహకులకు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వివిధ నర్సింగ్ కళాశాలలోని విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు నగరంలోని గాంధీబోమ్మ సెంటర్ నుంచి టౌన్హాల్ వరకు ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏజేసీ జెండా ఊపీ ప్రారంభించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ(ఎయిడ్స్,లెప్రసీ) డాక్టర్ రమాదేవి, డీటీసీఓ డాక్టర్ సురేష్కుమార్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ఎన్ఎన్పీ ప్లస్ సంస్థ నిర్వాహకురాలు ధనూజ, హిజ్రాల సంఘం జిల్లా అధ్యక్షురాలు అలేఖ్య పాల్గొన్నారు. -
బాలల హక్కుల సంరక్షణకు కృషి
జాయింట్ కలెక్టర్–2 రాజ్కుమార్ నెల్లూరు (దర్గామిట్ట) : బాలల హక్కుల సంరక్షణకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్–2 రాజ్కుమార్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జెడ్పీ కార్యాలయంలో జిల్లాలోని సేవా సంస్థలు, బాలసదన్లు హాస్టళ్లు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. జేసీ-2 మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికలు చదువు పట్ల శ్రద్ధవహిస్తూ క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలు ఎక్కడడైనా ఇబ్బందులకు గురైతే వెంటనే 1098, 100 నంబర్లకు కాల్ చేయాలన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి మాట్లాడుతూ బాలల సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని, బాలలకు సముచితమైన న్యాయం, న్యాయబద్ధమైన సేవలు అందిస్తామన్నారు.బాల నేరస్తులను చేరదీయడం, అనాథ బాలలకు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం విధి వంచనకు గురైన స్త్రీలకు రక్షణ కల్పించి వృత్తిలో నైపుణ్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో బాల సంరక్షణా కేంద్రాలు కోట,గూడూరు,వెంకటగిరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక నరసారెడ్డి, సెట్నల్ పీఓ సుబ్రహ్మణ్యం, సీడబ్ల్యూసీ చైర్మన్ రమేశ్బాబు జిల్లా బాల సంరక్షణా అ«ర్గనైజర్ బి.సురేష్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు
జేసీ 2 రాజ్కుమార్ నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో స్కాలర్షిప్పులపై చదువుకునే పేద విద్యార్థులను కళాశాల నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని జేసీ 2 రాజ్కుమార్ హెచ్చరించారు. నగరంలోని అంబేడ్కర్ భవన్లో గురువారం కళాశాల ప్రిన్సిపల్స్తో స్కాలర్షిప్పులపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు సంబంధిత శాఖకు హార్డ్కాపీలను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్రావు మాట్లాడుతూ స్కాలర్షిప్పులకు సరిపడా నగదు ఉందని హార్డ్కాపీలు ఇస్తే నగదు విడుదల చేస్తామని చెబుతున్నా ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావటం లేదన్నారు. హార్డ్కాపీలు ఇవ్వకుండా ఉండడమే కాకుండా విద్యార్థులు ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే ఎంత మంది ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారికి సంబంధించిన హార్ట్కాపీలను సాంఘిక, బీసీ కార్యాలయానికి పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. -
దేశప్రగతికి నిర్మాణాత్మక పాత్ర యువతదే
జేసీ-2 రాజ్కుమార్ ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు నెల్లూరు(బారకాసు): దేశప్రగతికి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుండేది యువతేనని జాయింట్ కలెక్టర్–2 ఎస్ఏ రాజ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నెల్లూరు పురమందిరంలో యువజన సర్వీసులశాఖ, సెట్నల్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను విజ్ఞాన సమపార్జనకు ఉపయోగించుకోవాలని సూచించారు. పెడద్రోవ పట్టకుండా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని తెలిపారు. ఇంటర్నెట్ను వినోదానికి కాకుండా విజ్ఞానానికి ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ప్రయత్నించాలన్నారు. లక్ష్యానికి అభిముఖంగా ప్రయాణించి గమ్యానికి చేరుకోవాలని ఈక్రమంలో కష్టాలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం డివిజన్ స్థాయిలో వివిధ రంగాలలో యువజన సర్వీసుల శాఖ, సెట్నల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు జ్ఙాపికలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. విజేతలు వీరే.. కర్ణాటక సంగీతం(గాత్రం) కుమారి లక్ష్మిప్రియ, జానపద సంగీతం వి.శ్రీలత, జానపద నృత్యానికి డిమనోహర్, వక్తృత్వ పోటీలకు సంబంధించి జి.లక్ష్మీనిహారిక, గ్రూపు జానపద నృత్యంలో బాలాజీగ్రూపునకు, అలాగే జానపద గీతానికి సంబంధించి యన్ లక్ష్మీచందన, భరతనాట్యంలో భవిత విజేతలుగా నిలిచారు. కాగా కార్యక్రమ వ్యాఖ్యాతగా బుల్లితెర నటుడు శింగంశెట్టి మురళీమోహన్రావు వ్యవహరించారు. సెట్నల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకు జి.నరసింహులు, ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపిల్ సాయిబాబ, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, సెట్నల్ ఏఓ ప్రసాద్, స్వచ్ఛంద సంస్థల జిల్లా అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు పాల్గొన్నారు. -
చేపల మార్కెట్ పరిసరాల్లో శుభ్రత అవసరం
నెల్లూరు రూరల్: చేపల మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ – 2 రాజ్కుమార్ సూచించారు. డైకస్రోడ్డు సెంటర్లోని చేపల మార్కెట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మార్కెట్ నిర్వహణపై వ్యాపారులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. చేపలు త్వరగా చెడిపోకుండా తగు జాగ్రత్తలతో భద్రపర్చుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు, ఎఫ్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement