దగ్ధమైన రెండు లారీలు: ఇద్దరికి తీవ్రగాయాలు | two people injured in lorry accident in khammam district court | Sakshi
Sakshi News home page

దగ్ధమైన రెండు లారీలు: ఇద్దరికి తీవ్రగాయాలు

Sep 24 2016 8:10 AM | Updated on Sep 4 2017 2:48 PM

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి.

ఖమ్మం : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు పూర్తిగా దగ్థం కావడంతో లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement