♦ అధ్వానంగా గ్రామీణ రోడ్లు
♦ బురదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
♦ పట్టించుకోని అధికారులు
కెరమెరి: రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడుతున్నా ఇక్కడ మాత్రం ఆ జాడలు కనిపించడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందే వర్షాకాలం ఆపై కచ్చా రోడ్లు ఎటూ వెళ్దామన్నా నరకయాతన అనుభవించాల్సిందే.
మండలంలో..
నిషాని గ్రామ పంచాయతీకి చెందిన దేవుడ్పల్లి, చింతపల్లి గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో మొత్తం 55 కుటుంబాల వరకు ఉంటాయి. 286 మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఇందాపూర్ వరకు బీటీ రోడ్డు ఉన్నప్పటికీ ఇందాపూర్ నుంచి దేవుడ్పల్లి వరకూ బీటీ వేయలేదు. అది కేవలం ఒక కిలో మీటరు మాత్రమే ఉన్నప్పటికీ నిధుల లేమితో ఇక్కడ పనులు నిలిచిపోయాయని సమాచారం. గతంలో చాలా సార్లు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను, నాయకులు వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు.
‘ఉపాధి’ నిధులతో కలగని మోక్షం..
గతంలో మండలానికి సుమారు కోటి రూపాయలతో ఉపాధి హామీలో రోడ్లు మంజూరయ్యాయి. కాని ఈ గ్రామాలకు మాత్రం మోక్షం కలగలేదు. అధికారులకు గుర్తుకు రాలేదో.. మనకెందుకులే అనుకున్నారో ఏమో తెలియదు గాని బీటీ రోడ్లు మంజూరు కాలేదు. వర్షాకాలంలో రోడ్లన్ని బురదగా మారి నడిచేందుకు యోగ్యంగా లేకుండా పోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో రోడ్లపై మొరం వేసినప్పటికీ అది ఎంతో కాలం నిలవడం లేదు. వర్షం వస్తే మళ్లీ గుంతలమయంగా మారుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా పొలాలు ఉండడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. రాత్రుళ్లు రైతులు అటుగా వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తమ గ్రామాలకు మిగిలి ఉన్న రోడ్లకు బీటీ వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
గతంలోనే ఆయా గ్రామాలకు బీటీ రోడ్ల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అయితే దేవుడ్పల్లి రోడ్డుకు నిషాని కనెక్ట్ రోడ్డు కోసం ప్రతిపాదనలు చేశాం. మరోవైపు ఆ గ్రామం పునరావాసం కింద వేరే ప్రాంతానికి వెల్లేదుంది.
– ఆత్మారాం, పీఆర్ఏఈ, కెరమెరి
ఇవేమి రహదారులు!
Published Sun, Jul 2 2017 4:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement