రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | The two young people killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Jul 20 2016 4:45 PM | Updated on Aug 30 2018 4:07 PM

వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

లక్కిరెడ్డిపల్లె మండలం గద్దెగుండ్లరాచపల్లె మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రనాయుడు(23), రమణ(22) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. బైక్‌పై స్వగ్రామం నుంచి రామాపురం మండలం హసనాపురానికి వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓ ఇంటి గోడను ఢీకొట్టారు. తీవ్రగాయాలపాలైన రామచంద్రనాయుడు అక్కడికక్కడే మృత్యువాతపడగా. రమణ అనే మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. మృతుల స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంచిన్నపోతులోల్లపల్లె. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement