స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ | The investigation must be independent judicial committee: JP | Sakshi
Sakshi News home page

స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ

Jan 20 2016 1:10 AM | Updated on Sep 3 2017 3:55 PM

స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ

స్వతంత్ర న్యాయ కమిటీతో విచారణ జరపాలి: జేపీ

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వ అధికారులతో కాకుండా స్వతంత్ర న్యాయ కమిటీతో సమగ్ర విచారణ

సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రభుత్వ అధికారులతో కాకుండా స్వతంత్ర న్యాయ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం భారతీయులంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అని పేర్కొన్నారు. కాగా, కులం పేరు సూచించే తోకలను తీసేసుకోవాలని ఆయన యువతను కోరారు. కులం, మతం సంబంధం లేకుండా కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement