విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వద్ద శుక్రవారం కలకలం చోటు చేసుకుంది. ఏలూరు కాల్వలో మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
విజయవాడ : విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వద్ద శుక్రవారం కలకలం చోటు చేసుకుంది. ఏలూరు కాల్వలో మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గురువారం పాత ఆసుపత్రిలో గల్లంతైన శిశువుదే సదరు మృతదేహం అని ప్రచారం జరిగింది. దీంతో ఆసుపత్రి వద్ద కలకలం బయలుదేరింది. ఆ మృతదేహన్ని గల్లంతైన బాలుడి తల్లిదండ్రులు పరిశీలించారు. కాలువలో దొరికిన మృతదేహం తమ బాబుది కాదని వారు స్పష్టం చేశారు.