తల్లిపాల వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ 1వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త కె.రాధ ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం
Aug 1 2016 9:38 PM | Updated on Sep 4 2017 7:22 AM
ఆదిలాబాద్ : తల్లిపాల వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ 1వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త కె.రాధ ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసవమైన సంవత్సరంలోపు తల్లి పిల్లలకు పాలివ్వాలన్నారు. తల్లి పాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రసవమైన వెంటనే వచ్చే పసుపచ్చని ముర్రు పాలను అప్పుడే జన్మించిన బిడ్డకు తప్పనిసరిగా పట్టాలని సూచించారు. ఈ నెల 7 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. మొదట అంగన్వాడీ కేంద్రం నుంచి మహిళలతో కాలనీలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎల్ఎంఎస్ కమిటీ సభ్యులు భాగీర్త, రబ్బానీ, స్వరూప, లావణ్య, కష్ణవేణి, వర్ష, సారిక, జ్యోతి, నర్మద, తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement