క్రీడా మైదానం తనిఖీ | sports ground checking | Sakshi
Sakshi News home page

క్రీడా మైదానం తనిఖీ

Aug 19 2016 12:35 AM | Updated on Sep 4 2017 9:50 AM

కళ్యాణదుర్గంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం విజిలెన్స్‌ ఎస్పీ అనిల్‌బాబు పరిశీలించారు.

అనంతపురం సెంట్రల్‌ : కళ్యాణదుర్గంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం విజిలెన్స్‌ ఎస్పీ అనిల్‌బాబు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్త విచారణలో భాగంగా ఈ క్రీడా మైదానాన్ని పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. క్రీడా ప్రాంగణం, చుట్టూ గోడలను ఇంజనీర్ల సహాయంతో తనిఖీ చేశారు. గ్రౌండుకుS ఏ రకమైన గ్రావెల్‌ని వాడారు, భవనాల కట్టడంలో పునాది పటిష్టత, గోడల మందం తదితర వాటిని పరిశీలించారు.

సదరు క్రీడా మైదానాన్ని జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో హౌసింగ్‌బోర్డు అధికారులు నిర్మించి క్రీడా సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. పైకా గ్రాంట్స్‌ ద్వారా జిల్లాలో నార్పల, పెనుకొండ, రామగిరి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వీటి నిర్మాణ ంలో నాణ్యతా ప్రమాణాల గురించి తనిఖీలు చేయడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement