కొనసాగుతున్న తనిఖీలు | search for maoists | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న తనిఖీలు

Jul 25 2016 11:48 PM | Updated on Apr 3 2019 9:27 PM

కొనసాగుతున్న తనిఖీలు - Sakshi

కొనసాగుతున్న తనిఖీలు

ఛత్తీస్‌గఢ్, ఖమ్మం, వరంగల్‌ జిల్లా సరిహద్దు గ్రామాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టులు ఏజెన్సీ అడవుల్లోకి వస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని పెంచడమే కాకుండా మాజీలను విచారిస్తున్నారు.

ఏటూరునాగారం :  ఛత్తీస్‌గఢ్, ఖమ్మం, వరంగల్‌ జిల్లా సరిహద్దు గ్రామాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టులు ఏజెన్సీ అడవుల్లోకి వస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని పెంచడమే కాకుండా మాజీలను విచారిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా వేసి కూపీ లాగుతున్నారు. ఒక పక్క గ్రేహౌండ్స్‌ దళాలు, మరో పక్క సీఆర్‌పీఎఫ్, సివిల్‌ బలగాలతో ఏజెన్సీ పల్లెల్లు అట్టుడుడికిపోతున్నాయి. గొత్తికోయ గూడేలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మండల కేంద్రంలోని లాడ్జీలు, హోటళ్లలో క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏజెన్సీలో భయానక వాతావరణం కనిపించడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement