హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని ప్రముఖ ఫొరెన్సిక్ నిపుణుడు నారాయణ రెడ్డి అన్నారు. ఆమెది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో నివృత్తి చేయాల్సిన కోణాలు చాలా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు రెండు రకాల పొగలు వస్తాయని అందులో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతాయని, మోనాక్సైడ్ ఉంటే కాలిన దేహం బ్రైట్ రెడ్ గా మారిపోతుందని దీనిద్వారా కాలిన గాయాలతోనే చనిపోయినట్లు స్పష్టమవుంతుందని అన్నారు.
అలా లేకపోతే ముందే చంపి కాల్చివేశారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎడమవైపు ఎక్కువ కాలిందని చెబుతున్నారని అలా ఎందుకు జరిగిందో తెలియాల్సి ఉందన్నారు. అసలు ఘటన జరిగిన తర్వాత తలుపులు ఎవరు తెరిచారన్నది కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్లూజ్ టీంతోపాటు ఫొరెన్సిక్ డాక్టర్లను కూడా ఘటన స్థలానికి తీసుకెళ్తే బాగుండేదని పక్కా సమాచారం తెలిసేదని అన్నారు.
తెల్లవారుజామున చనిపోతే.. సాయంత్రం వరకు నేరస్థలంలోనే మృతదేహాలు ఉన్నాయని ముందుగానే అక్కడికి వైద్యులను తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. పెద్దకుమారుడు, తల్లి డోర్ దగ్గరే మరణించారంటే, తలుపులు బయటి నుంచి గడియ వేస్తే తెరవడానికి వెళ్లారా అనే కోణంలో కూడా ఆలోచించాలనన్నారు. కనీసం మంటలు అంటుకునే ముందు పిల్లలు అటూ ఇటూ పరుగెత్తాలని కానీ ఇద్దరు బెడ్పై అలాగే పడి ఉండి చనిపోవడం అనుమానం కలిగిస్తోందన్నారు. రెండు సిలిండర్లు తీసుకెళ్లి, ఒకదాన్నే తెరిచారని, ఒకదాన్ని అలాగే వదిలేశారని చెబుతున్నారు కానీ దీనిపై అనుమానమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
Published Thu, Nov 5 2015 7:11 PM
Related news
-
‘మా అబ్బాయి ఓడిపోవాలి’.. కేంద్ర మాజీ మంత్రి
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోక్సభ ఎన్నికలో ఓటమిపాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీ తరఫున పతనంతిట్ట పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడు అనిల్ ఆంటోని అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ పతనంతిట్ట సెగ్మెంట్లో ఓడిపోతుంది. అక్కడ నా కుమారుడు అనిల్ ఆంటోని ఓడిపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా కేరళ సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ గెలుస్తారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీ చేరటం చాలా పెద్ద తప్పు. ..కాంగ్రెస్ పార్టీనే నా మతం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ... ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పోరాడుతోంది. సీఎం పినరయి విజయన్ చేసే ఆరోపణలను కేరళ ప్రజలు అంత సీరియస్ తీసుకోరు. ఆ మాటలను కేరళ ప్రజలు అస్సలు నమ్మరు’ అని ఏకే ఆంటోని అన్నారు. బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని..ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏకే ఆంటోని జోష్యం చెప్పారు. ఇక.. 2023లో అనిల్ ఆంటోని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
కూతురి ప్రేమ పెళ్లి.. ఫ్లెక్సీతో షాక్ ఇచ్చిన తండ్రి
రాజన్న సిరిసిల్ల: ఓ తండ్రి తన కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె అడిగినది కాదనక పెంచి పెద్ద చేశాడు. అయితే ఇప్పుడు తన తండ్రికి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుంది.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి..చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమై నెట్టింట వైరల్గా మారింది. ఏం జరిగిందంటే.. ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి తన కూతురికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేసి బంధుమిత్రులందరికీ తన కూతురు చనిపోయిందని పిండ ప్రదానాలు చేశాడు. ఈ షాకింగ్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఫోటో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైరల్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష అనే యువతి ఇటివలే ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. ఇలా కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న బాధను జీర్ణించుకోలేక తండ్రి ఈ దురాగతానికి పూనుకున్నాడు. pic.twitter.com/6ulb1dCIad — Telugu Scribe (@TeluguScribe) April 8, 2024 -
ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు
సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడు, నాలుగు నెలలుగా ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు.. యాత్రలు చేస్తున్నాడే తప్ప రైతుల బాధలు చూడట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో నీరు లేక ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పొలాలు నీరు లేక ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కానీ, మంత్రులు కానీ పొలాల దిక్కు చూసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో కాళేశ్వరంపై, కేసీఆర్పై కడుపు మంటతో మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను రిపేరు చేయకుండా.. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా పొలాలను ఎండబెట్టారని ఆరోపించారు. గతంలో గోదావరి నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా చెరువులు నింపి పొలాలు ఎండిపోకుండా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. సారంపల్లిలో పొలాలను చూస్తుంటే.. మేతకు తప్ప కోతకు పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి అప్పులు కడతారా.. చస్తారా.. అన్నట్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల ఖజానా నింపుతున్నారు యాసంగి సీజన్లో రైతుబంధుకు రూ.7వేల కోట్లు సిద్ధం చేస్తే.. రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తూ వాళ్ల ఖజానా నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయోజనాల కోసం రైతులను గోసపెడుతోందన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తానని రేవంత్రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అడ్డుకాకుండా ఈసీకి లేఖ రాసి రుణమాఫీని ప్రకటించాలన్నారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలని, పంటలు ఎండిన రైతులను, కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ఇచ్చిందని, ఇప్పుడు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ధైర్యం నింపి వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పొలాలను సందర్శించాలని కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. నిరుడు చెరువుల్లోకి కాల్వనీరు వచ్చి పొలం పారిందని, ఈసారి పది ఎకరాల్లో వరి వేస్తే మొత్తం ఎండిపోయిందని కేటీఆర్కు పర్శరాములు అనే కౌలు రైతు చెప్పారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. -
కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్ఫోన్లు ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. ఇదీ చదవండి: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు -
పాలమూరు ‘లోకల్’ పోరుకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్దే ఆధిపత్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది.
Related News by category
-
నీటి ఎద్దడి రాకుండా చూడాలి
దుగ్గొండి : వేసవి పూర్తయ్యే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపలబండ, గిర్నిబావి, అడవిరంగాపురం గ్రామాల్లో గురువారం ఆయన తాగునీటి వనరులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని బావుల్లో నీటి లభ్యత, గ్రామానికి కావాల్సిన నీటి అంచనాలను బేరీజు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని పైపులైన్ ద్వారా నీటిని బావిలోకి పోయించాలన్నారు. చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యదర్శులు నిరంతరం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు వైనాల రాజు, మాడిశెట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి నల్లబెల్లి : గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మండలంలోని నందిగామ గ్రామాన్ని గురువారం ఆమె గురువారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. డీపీఓ వెంట మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి వద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ స్థానం బీజేపీదే.. గీసుకొండ : దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈసారి వరంగల్ ఎంపీ స్థానం బీజేపీకే అని పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మరోమారు మోదీ అధికారంలోకి వస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అవసరమైన నిధులు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు జాన్విక్రం, నాయకులు కత్తి వెంకన్న, ఆకుల వెంకన్న, మర్రి రాజు, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న చేను దగ్ధం ● మూడు గొర్రెలు సజీవ దహనం ● రూ.2 లక్షల ఆస్తినష్టం నర్సంపేట రూరల్ : అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేను దగ్ధమైన సంఘటన మహేశ్వరం గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన నామాల పరమేశ్వర్కు మహేశ్వరం గ్రామ శివారులోని 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు గాలికి మంటలు చెలరేగడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. మొక్కజొన్న చేనులో మేత మేస్తున్న మూడు గొర్రెలు సైతం సజీవ దహనమయ్యాయి. మొత్తం రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. -
ఎల్ఈడీ వెలుగులేవి?
నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్ స్థానంలో మరో లైట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను విస్మరించిన ఈఈఎస్ఎల్ ఐదు నెలలుగా అంధకారం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 323 గ్రామాలు.. 319 జీపీల్లో 56 వేల లైట్లుసంస్థ పట్టించుకోవడం లేదు.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్ఈడీ వెలుగులు అందించాలి. – కూచన ప్రకాశ్, మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లిచర్యలు తీసుకుంటాం..గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం. – కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి -
సాధారణానికి మించి..!
సాక్షి, వరంగల్ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజకీయ పార్టీలకు గండం.. ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు.. నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు.. సభలకు బదులు ఫంక్షన్హాళ్లలో రాజకీయ పార్టీల సమావేశాలు అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచనరోజు ప్రాంతం డిగ్రీ సెల్సియస్లలో ఆదివారం ఉర్సుగుట్ట 40.4 సోమవారం ఖిలా వరంగల్ 42.4 మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4 బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7 గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1 -
అరూరి చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
పాలిటిక్స్ షురూ..
శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం – 8లోuసాక్షి, వరంగల్ : ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మాను కోటలో సీఎం ప్రచారసభలో పాల్గొన నున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డు, మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్డు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆ పార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేత ల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబు తున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. న్యూస్రీల్ ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతల ప్రచారానికి ప్లాన్ నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరానామినేషన్ సెంటర్వద్ద భారీ బందోబస్తు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వరంగల్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం నామినేషన్ సెంటర్లోని ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. నేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా, మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధి కారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరి శీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement