రేపటి నుంచి సమ్మెటివ్‌–1 పరీక్షలు | sammative exams-1 from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సమ్మెటివ్‌–1 పరీక్షలు

Sep 19 2016 11:53 PM | Updated on Sep 26 2018 3:25 PM

జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలను నిర్వహించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో ఆదేశించారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలను నిర్వహించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో ఆదేశించారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలను నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జరపాలని కోరారు. ప్రశ్న పత్రాలను సంబంధిత కీ సెంటర్ల నుంచి ఆథరైజేషన్‌ లెటర్, డీసీఈబీకి చెల్లించిన కాంట్రిబ్యూషన్‌ రసీదును సమర్పించి పొందాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement